*కేసీఆర్ విజన్తో సకల కళల వికాసం*
ప్రపంచ తెలుగు మహాసభల్లో అంతా తానై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన పాత్ర తెరవెనుకే ఉండిపోయింది. అప్పుడే పుట్టిన శిశువు తెలంగాణ సాహిత్య అకాడమీని ముందు నిలిపి తాను అన్నీ ఒక తల్లిలా సవరించి, తెరవెనుకే ఉండిపోయిన బృందం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖది. వందలాది కవులు, కళాకారులు, కథకులు, రచయితలు, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఎందరినో వేదికపై కనులారా తిలకించడం ఒక చరిత్ర. మన చరిత్రను మనం, మన సంస్కృతిని మనం గర్వించేలా తీర్చిదిద్దడం గత నాలుగేండ్ల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కృషి సారాంశం. గతంలో ఇలాంటిది ఊహించి ఉండలేదు. కలలు మాత్రం కన్నాం. ఆ కలలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజన్ ఉన్న నాయకత్వం, సలహాదారులు, ప్రభుత్వ కార్యదర్శులు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ల, తదితరుల సమిష్టి కృషి, కమిట్మెంట్ వల్లనే సాధ్యపడుతున్నది. ఈ కృషి మరింత విస్తృతంగా కొనసాగడం అవసరం.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న కృషి అద్వితీయమైనది. తెలంగాణ కళలు, సాహి త్యం, తెలంగాణ తేజోమూర్తులు గురించి చేస్తున్న కృషి అపూర్వమైనది. రవీంద్రభారతి, కళాభవన్ కేంద్రంగా జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు తెలంగాణ భాషను, సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని పతాక రీతి ప్రదర్శిస్తున్నాయి. తెలంగాణ సినిమా నూతన వికాసం కోసం రవీంద్రభారతి పైడి జయరాజ్ థియేటర్లో ప్రతి శని, ఆదివారాలు జరుగుతున్న సినిమా, డాక్యుమెంటరీ ప్రదర్శనలు వాటికవే ఒక గొప్ప జాతీ యస్థాయి ప్రదర్శనలుగా నిలుస్తున్నాయి. ఎందరో యువనటులు, దర్శకులు, రచయితలు ప్రపంచంలోని విభిన్న అంశాల సినిమాలను, డాక్యుమెంటరీలను చూసి తమదైన తెలంగాణ సినిమాను రూపొందించే కృషి చేయడం ప్రశంసనీయం. శనివారం ప్రాంతీయ భాష చిత్రాలను ప్రదర్శించడం అందుకు శనివారాన్ని సినీవారంగా ప్రచారం చేయడం దానికదే ఒక కొత్త చరిత్ర. ప్రతీ ఆదివారం జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సినిమాలను ప్రదర్శించడం ఒకనాడు ఫిలిం సొసైటీలు చేసిన పనిని భాషా సాంస్కృతిక శాఖ నెరవేర్చడం గొప్ప విషయం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ప్రోత్సాహంతో, తెలంగాణ జన జీవితం పై, సంస్కృతిపై, సమస్యలపై, అభివృద్ధి సంక్షేమంపై ఎన్నో డాక్యుమెంటరీలు వెలువడ్డాయి. నూతన ఒరవడి తెలంగాణ సినిమా అనేది ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటూ విజయాలు సాధిస్తున్నది. రవీంద్రభారతి మినీహాల్ అనేక సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనల కు, పుస్తకావిష్కరణలకు వేదికగా నిలుస్తున్నది. అనేక సెమినార్లు కూడా జరుగడం విశేషం. రవీంద్రభారతి మెయిన్హాల్లో నిరంతరం జరుగుతున్న ప్రదర్శనలు, సభలు వాటికవే ఒక మహత్తర చరిత్ర. తెలంగాణ మహనీయుల జయంతి, వర్ధంతి సభలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించడం తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే సాధ్యపడింది. రవీంద్రభారతిలో ప్రదర్శన ఇవ్వడమంటే, రవీంద్రభారతిలో సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సభ పెట్టుకోవాలంటే పూర్వం అందని ఆకాశం. జీవితానికి ఒక్కసారైనా రవీంద్రభారతిలో వేదికపై సభనో, సాహిత్య ప్రదర్శనో జరుపాలనుకునే ఆశయం ఉండేది. అదిప్పుడు అందరికి అందిన ఆకాశం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి.
రవీంద్రభారతి ముందున్న ఓపెన్ ఆడిటోరియంలో ఎన్నో జానపద, ప్రజాకళల ప్రదర్శనలు జరుగుతున్నాయి. కళాభవన్ మొదటి అంతస్తు లో నిరంతరంగా ఆర్ట్ ప్రదర్శనలు, ఫొటో ప్రదర్శనలు, తెలంగాణ సం స్కృతిని, తెలంగాణ చిత్రకారుల ఫొటోగ్రాఫర్ల నైపుణ్యాన్ని విస్తృతంగా వెలికి తెస్తున్నాయి. కేసీఆర్ విజన్ వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కేసీఆర్ విజన్తోపాటు సాంస్కృతిక సలహాదారు కె.వి. రమణాచారి, సాంస్కృతిక శాఖ, టూరిజం, బీసీ సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణల సమిష్ఠి కృషి ఎంత మెచ్చుకున్నా తక్కువే. మామిడి హరికృష్ణ తొలి యవ్వన ప్రా యం నుంచే రచన ప్రారంభించి అనేక వ్యాసాలు, కవితలు విశ్లేషణలు రాసి తనదైన ముద్ర కలిగినవాడు. జీవితాన్ని సాహిత్యానికి, సంస్కృతి కి, కళలకు అంకితం చేస్తూ ఒక మహోద్యమంగా రాత్రింబవళ్లు పనిచేయడం మరచిపోలేనిది. అలాంటి నిబద్ధత గల వ్యక్తి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా రావడం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కలిసి ఒక గొప్ప చరిత్ర సృష్టించడుతున్నది. కేవలం రవీంద్రభారతి ఆవరణలోని కార్యక్రమాలే కాకుండా త్యాగరాయ గానసభ, సుందరయ్య విజ్ఞా న కేంద్రం, ప్రెస్క్లబ్ వంటి చోట్ల జరిగే కార్యక్రమాలకు ఇతోధికంగా సౌజన్యాన్ని అందిస్తూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న కృషి అపూర్వమైనది. ఇలాంటి కార్యక్రమాలతోపాటు మరెన్నో కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తూ వస్తున్న విషయం చాలామందికి తెలియదు. పలు కార్యక్రమాల వెనుక నిట్టాడుగ, వెన్నెముకగా తెలంగా ణ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నేపథ్యంలో ఉండి అనేక కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నది. ప్రగతిభవన్, జనహితలో ఉగాది సమ్మేళనాలు కానీ, గవర్నర్ నిర్వహించే కార్యక్రమాలు గానీ, బతుకమ్మ పండుగ ఉత్సవాలు గానీ, గోల్కొండ ఖిల్లాను, ఆయా ఉత్సవాల సందర్భంగా వందలాది కళాకారులతో కన్నులపండుగగా తీర్చిద్దిడం గాని, సంక్రాంతి ముగ్గుల ఉత్సవాలు గానీ, కళాత్మకంగా గొప్ప స్ఫూర్తితో నిర్వహించబడుతున్న తీరు గుర్తు చేసుకుండా ఉండలేము. ప్రపంచ తెలుగు మహాసభల్లో అంతా తానై తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన పాత్ర తెరవెనుకే ఉండిపోయింది.
అప్పుడే పుట్టిన శిశువు తెలంగాణ సాహిత్య అకాడమీని ముందు నిలిపి తాను అన్నీ ఒక తల్లిలా సవరించి, తెరవెనుకే ఉండిపోయిన బృందం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖది. వందలాది కవులు, కళాకారులు, కథకులు, రచయితలు, తెలంగాణ సాంస్కృతిక సారథి బృందాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఎందరినో వేదికపై కనులారా తిలకించడం ఒక చరిత్ర. తెలంగాణ మహనీయుల పేరిట నగరమంతటా ద్వార తోరణాలు ఏర్పా టుచేయడం, అన్నీచూసి మనస్సు పులకరించినవారు అరుదు. అంతేకాదు తెలంగాణ సారస్వత పరిషత్, తెలుగు అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంస్థలకు దీటుగా అత్యున్నత ప్రమాణాలతో అనేక గ్రంథాలు వెలువరించడం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకే సాధ్యపడింది. తెలంగాణ తేజోమూర్తులు పెద్ద పుస్తకంలో 153 మంది తెలంగాణ తేజోమూర్తుల గురించి అందంగా అచ్చువేసిన పుస్తకం కలకాలం నిలిచిపోతుంది. సినారె గురించి స్వరనారాయణీయం అనే గ్రం థం దానికదే ఒక డాక్యుమెంట్. తొలిపొద్దు అనే శీర్షికతో నాలుగువందల నలభై మంది కవుల కవిత్వంతో తెచ్చిన కవిత్వ పుస్తకం ప్రభుత్వం కూడా ఇంత అందంగా అచ్చువేస్తుందా అని సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం మనవంతు. అలాగే ఆత్మగౌరవ సంకేతంగా తంగేడువనం అనే కవితా సంకలనం తంగేడు పూలపై అత్యధిక కవితలతో వెలువడటం ఒక మహాఖండకావ్యం. ఇందులో 166 కవితలు తీరొక్క తీరును వ్యక్తీకరిస్తాయి. కాళోజీ బతుకమ్మా బతుకు కవితతో ప్రారంభమైన ఈ సంకలనం దానికదే ఒక విశిష్ఠమైన గ్రంథం. శతాబ్దాలుగా కనుమరుగయిపోయిన కాకతీయుల నాటి పేరిణి నృత్యాన్ని పునర్జీవింపజేసిన ఖ్యాతి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకే దక్కుతుంది. నటరాజ రామకృష్ణ వెలికితీసిన తర్వాత దానిని 40 రోజుల పాటు శిక్షణ ఇచ్చి పేరిణి తాం డవం, పేరిణి లాస్యంలను అభివృద్ధి పరుచడంతో పాటు 4 ఏండ్ల కోర్సు గా మార్చి సిలబస్ రూపొందించి 400 మంది శిక్షణ పొందేట్టు కృషి సల్పిన తీరు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకున్నది. కవిత్వమే కాకుండా తెలంగాణ హార్వస్ట్ అనే గ్రంథాన్ని ప్రముఖుల కథకులతో ఇంగ్లీష్ అనువాద సంకలనాన్ని ప్రచురించారు.
2015లో వెలువరించిన కొత్తసాలు అనే కవితా సంకలనంలో 60 మంది కవుల కవితలను ఫొటో, చిరునామాలను అందించడం ఒక గొప్ప విశేషం. అలాగే మట్టి ముద్ర అనే కవితా సంకలనాన్ని శ్రీ దుర్ముఖినామ ఉగాది 2016 సందర్భంగా ప్రచురించారు. ఇందులో 64 మం ది కవులతోపాటు వారందరి ఫొటోలు, చిరునామాలు కూడా ప్రచురించడం నిజంగా ఎంత అబ్బురమో. అలాగే స్వేదభూమి అనే గ్రంథం 2017 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల కవుల అక్షర నీరాజనంగా 66 కవుల కవితలతో వెలువరించారు. హేవళంబి నామ ఉగాది కవిత్వం తల్లి వేరు అనే గ్రంథంలో సంకలించారు. ఇందులో 47 మంది కవుల కవి సమ్మేళనం పొందుపరిచారు. అలాగే నయాసాల్ అనే పేరుతో 2017లో 59 మంది కవితలను హిందీలోకి అనువదించి తీసుకురావ డం జరిగింది. ఎంతో పట్టుదల ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. ఎందరో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా డైరెక్టర్లుగా వచ్చారు, వెళ్లారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అందివచ్చిన అవకాశాలను ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవాలో అంత విరివిగా విస్తరించడం జరుగుతున్నది. ఈ చరిత్రను తర్వాతి కాలంలో ఇదేస్థాయిలో నిలుపుకోవడం దానికదే ఒక గొప్ప విశే షం. ఈ కృషి దానికదే ఒక జాతీయస్థాయి రికార్డు. డెభ్భై ఏండ్ల స్వాతంత్య్రానంతర తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ఈ కృషిలో మరికొన్ని జోడించకపోతే భాషా సాంస్కృతికశాఖ కృషిని అసమగ్రంగా చెప్పినట్టవుతుంది. కల్చర్ ఆఫ్ యెమిటీ పేరిట హైదరాబాద్లోని దర్గాల గురించిన చక్కని ఫొటోలతో ప్రచురించిన పుస్తకం జాతీయస్థాయిలో నాటకోత్సవాలను రవీంద్రభారతి వేదికపై ఘనంగా నిర్వహించడం కళాకారులను సత్కరించడం, జానపద కళలతో పాటు మిమిక్రీ మైవ్ు, కూచిపూడి, భరతనాట్యం, పేరిణి నృత్యం ఆధునిక తెలంగాణ చరిత్ర, సంస్కృతి గురించిన ప్రదర్శనలు మరుగునపడిన చరిత్ర, సంస్కృతి వెలికితీస్తూ రచించిన దృశ్యరూపకాలను, రాష్ట్రవ్యాప్తంగా రవీంద్రభారతితో పాటు ప్రదర్శింపజేయడం మొదలైనవి మన చరిత్రను మనం, మన సంస్కృతిని మనం గర్వించేలా తీర్చిదిద్దడం గత నాలుగేండ్ల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కృషి సారాంశం.
గతంలో ఇలాంటిది ఊహించి ఉండలేదు. కలలు మాత్రం కన్నాం. ఆ కలలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజన్ ఉన్న నాయకత్వం, సలహాదారులు, ప్రభుత్వ కార్యదర్శులు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ల, తదితరుల సమిష్టి కృషి, కమిట్మెంట్ వల్లనే సాధ్యపడుతున్నది. ఈ కృషి మరింత విస్తృతంగా కొనసాగడం అవసరం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ప్రారంభమైన దశ దిశల విస్తరించిన తెలంగాణ భాషా సాంస్కృతిక కృషి రేపటితరాలకు మార్గదర్శనంగా నిలుస్తుంది. ఇందుకు కృషిచేసిన, సహకరించిన, జీవితాలను అంకితం చేసిన అధికారులకు, కళాకారులకు, రచయితలకు, దర్శకులకు, నటులకు, నేపథ్యంలో కృషిచేసిన వారికి, గాయకులకు అందరికి ఒకసారైనా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పకపోతే కడుపు నిండదు. భాషా సాహిత్య సాంస్కృతిక కళాదృష్టి దృక్పథం లేని, వాటి ప్రాధాన్యం గుర్తించని నాయకత్వం ఉంటే ఇవి వాస్తవరూపం ధరించడం కాదు కదా ఊహించడమే కష్టం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్)
Harikrishna Mamidi , Telugu Culture
#తెలంగాణ #Telangana #Culture #TelanganaCinema #కేసీఆర్_విజన్
#KCRVISION
#RavindraBharathi
#రవీంద్రభారతి #తెలంగాణ_ప్రభుత్వ_భాషా_సాంస్కృతిక_శాఖ #కళాభవన్
https://www.ntnews.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=496129
No comments:
Post a Comment